Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై డా||లింగేశ్వర్ నిర్మిస్తున్న చిత్రం 'ఉండిపోరాడే'. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న
ఈ చిత్రం గురించి దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ, 'ఇదొక రియలిస్టిక్ స్టోరి. పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషన్స్, మనసులు కదిలించేలా ఓ పాట ఉంది. ఇటీవల కన్నడలో విడుదల చేసిన ఆడియో విడుదలయ్యింది. కేదార్ శంకర్, అజరు ఘోష్ల పాత్రలు సినిమాకు హైలెట్గా ఉంటాయి' అని అన్నారు.
'సబు వర్గీస్ అందించిన ఆడియోని ఈ నెల 23న విడుదల చేయనున్నాం. ఇంత వరకు తెరపై రానటువంటి కథ ఇది. నాన్నపై సుద్దాల అశోక్ తేజ రాసిన పాటకు అవార్డ్స్ వస్తాయనడంలో సందేహం లేదు. ప్రతి తల్లితండ్రితోపాటు పిల్లలందరూ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేసే సినిమా. మధ్యలో ఎంత మంది వచ్చినా చివరి వరకు మనల్ని ప్రేమించేది మాత్రం తల్లిదండ్రులే అనే సందేశం మా సినిమా ద్వారా ఇస్తున్నాం. విలువలు, బాంధవ్యాలు చూపిస్తూనే కమర్షియల్ హంగులు జోడించాం. పెద్ద సింగర్స్తో పాటలు పాడించాం. జులై నెలాఖరులో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత చెప్పారు. 'ఇందులో ప్రతి పాట సందర్భానుసారంగా ఉంటుంది. దర్శక నిర్మాతలు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మంచి పాటలు ఇవ్వగలిగాను' అని సంగీత దర్శకుడు సబు వర్గీస్ చెప్పారు.