Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, పాయల్ రాజ్పుత్, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' చిత్రం రూపొందుతుంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి యూనిట్ తెలియజేస్తూ, 'మాస్ మహారాజా, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఆర్ఎఫ్సీలో రవితేజ, వెన్నెల కిషోర్ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు సీన్స్ షూట్ చేశాం. అలాగే పాతబస్తీలో మరికొన్ని ముఖ్యమైన సీన్స్ని రవితేజ, ఇతర ప్రధాన తారాగణంపై చిత్రీకరించాం. పాతబస్తీలో షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో ఓ మేజర్ షెడ్యూల్ని చిత్రీకరిస్తాం. ఇందులో నభా నటేష్, పాయల్ రాజ్పుత్తో పాటు మరో కథానాయికకు చోటుంది. ఆమె ఎంపిక జరగాల్సి ఉంది. అభిరుచి గల నిర్మాత రామ్ తాళ్లూరి సినిమాని భారీగా, నిర్మాణ విలువల విషయంలో రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్కి అద్భుతమైన స్పందన లభించింది' అని తెలిపింది. బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్కి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటర్: నవీన్ నూలి.