Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ సాధారణ వ్యక్తి సైకోగా మారటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్, థ్రిల్లర్ అంశాల సమహారంగా ఎస్.ఎం.వి. ఫిలింస్ పతాకంపై పోలూర్ ఘటికాచలం సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. గతంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సైకోగా కీలకమైన పాత్రలో నవీన్ కె.చారిని పరిచయం చేస్తున్నాం. హీరోయిన్లుగా ఆకాంక్ష, అక్షయ నటిస్తున్నారు. కామెడీ, రొమాన్స్, థ్రిల్తోపాటు సస్పెన్స్కి గురి చేసే ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. జూలైలో షూటింగ్ ప్రారంభిస్తాం. వికారాబాద్, కర్నూలు, జగిత్యాలలో చిత్రీకరణ జరుపుతాం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ వినూత్న సైకో థ్రిల్లర్ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని దర్శకుడు తెలిపారు. ధన్రాజ్, తాగుబోతు రమేష్, చమ్మక్చంద్ర, చిట్టిబాబు, అశోక్కుమార్, గుండా భవాని తదితరులు నటించనున్న ఈచిత్రానికి కెమెరా : సురేంద్రరెడ్డి, ఎడిటింగ్ : నందమూరి హరి, మాటలు-పాటలు-సంగీతం: పోలూర్ ఘటికాచలం, నిర్మాత : సర్విశెట్టి ప్రభాకర్ శెట్టి.