Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మమ్ముట్టి, జై, మహిమా నంబియార్ కీలక పాత్రధారులుగా మలయాళంలో రూపొందిన చిత్రం 'మధురరాజా'. ఈ చిత్రాన్ని తెలుగులో 'రాజా నరసింహా' పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సాధుశేఖర్ మాట్లాడుతూ, 'మన్యంపులి' వంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వైశాక్ ఈ చిత్రాన్ని సైతం అదే రీతిలో అద్భుతంగా తెరకెక్కించారు. ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ చిత్రం దాదాపు వందకోట్లని రాబట్టింది. 'యాత్ర' వంటి సూపర్హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ముమ్మట్టి హీరోగా తెలుగులో వస్తున్న చిత్రమిది. మలయాళంలో భారీ విజయం సాధించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో మమ్ముట్టి, జై పాత్రలు అందరినీ అలరిస్తాయి. ప్రతినాయకుడిగా జగపతిబాబు నట విశ్వరూపాన్ని చూస్తారు. సన్నీలియోన్ నటించిన స్పెషల్ సాంగ్ యూత్తోపాటు అందర్నీ ఉర్రూతలూగిస్తుంది. గోపీసుందర్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.