Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్తగిరి, వైభవీ జోషి జంటగా, అర్చన కీలక పాత్రలో అరుణ్ పవార్ దర్శకత్వంలో 'వజ్రకవచధర గోవింద' చిత్రం రూపొందింది. శివశివమ్ ఫిల్మ్స్ పతాకంపై నరేంద్ర, జీవీఎన్ రెడ్డి నిర్మించారు. ఇటీవల సినిమా విడుదలైన నేపథ్యంలో ఆదివారం సక్సెస్మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ, 'సినిమాకి మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. సెకండాఫ్ కొంచెం ల్యాగ్ ఉందన్నారు. పది నిమిషాలు కట్ చేశాం. ఇప్పుడు కచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. సినిమా బడ్జెట్కి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యామని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. నిర్మాతలకు, సహకరించిన టీమ్ అందరికి థ్యాంక్స్. చిన్న సినిమాని ఆదరించి, కాపాడండి' అని అన్నారు. 'కాలేజ్, స్కూల్స్ ప్రారంభమైన సందర్భంలోనూ మా సినిమాకి ఇంత ఆదరణ రావడం ఆనందంగా ఉంది.
సినిమా మాస్ సెంటర్లలో బాగా ఆడుతోంది. సినిమా ఇంత బాగా రావడానికి కారణం, నేనీ స్థానంలో ఉండటానికి కారణం సప్తగిరి. ఆయనకు థ్యాంక్స్. నిర్మాతలకు రుణపడి ఉంటాను. సినిమా చూసి థియేటర్లో ప్రేక్షకులు నవ్వుతుంటే గర్వంగా ఉంటుంది. రోజు ఫైవ్ స్టార్ హోటల్లో తింటాం. అప్పుడప్పుడు రోడ్డుపక్కన బండిపై తినే భోజనం చాలా బాగుంటుంది. అలాంటి చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని దర్శకుడు అరుణ్ పవార్ తెలిపారు. నటి అర్చన మాట్లాడుతూ, 'ఇందులో నేను నల్లూరి ప్రసన్న లక్ష్మి పాత్రలో ఎమ్మెల్యేగా నటించా. ఆ పేరులో చాలా బలం ఉంది. తెలుగమ్మాయికి తెలుగు సినిమాలో ఇలాంటి శక్తివంతమైన పాత్రలు దక్కడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని ఏ సెంటర్ వాళ్ళు చూస్తే దీని టేస్ట్ తెలుస్తుంది' అని చెప్పారు. 'ఈ ఏడాది సరైన సినిమాలు లేక థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. అలాంటి సమయంలో మా సినిమాని 450 థియేటర్లలో విడుదల చేశాం. ప్రేక్షకుల ఆదరణతో బాగా ఆడుతోంది. రెండు రోజుల్లో రూ90లక్షల గ్రాస్ వసూలు చేసింది. మేం ఇరవై, ముప్పై కోట్ల సినిమా తీయలేదు. చిన్న హీరోతో
చిన్న బడ్జెట్లో చేశాం. అనుకున్నది సాధించాం. సప్తగిరి హీరోగా ఈ నెల 29న 'సప్తగిరికి దెయ్యం పట్టింది' సినిమా ప్రారంభించబోతున్నాం' అని సినిమాని విడుదల చేసిన బ్రహ్మయ్య తెలిపారు. నిర్మాత జీవీఎన్ రెడ్డి చెబుతూ, 'సప్తగిరి వల్లే మా బ్యానర్కి గుర్తింపు వచ్చింది. మాది మాస్ చిత్రంగా మంచి ఆదరణ పొందుతుంది. పడిన శ్రమకి తగ్గ ఫలితం వచ్చింది. ఆదరిస్తున్న ఆడియెన్స్కి ధన్యవాదాలు' అని చెప్పారు.