Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా, సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు తెలుగు, తమిళం, హిందీలో 'సాహో' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సంగీత త్రయం శంకర్ ఎహ్ లాస్ లాయ్ తప్పుకున్న విషయం విదితమే. తాజాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించేందుకు జిబ్రాన్ని ఎంపిక చేశారు. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ భారీ చిత్రానికి స్టార్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడం విశేషం. 'రన్ రాజా రన్', 'విశ్వరూపం', 'జిల్' వంటి చిత్రాలతో మ్యూజిక్లో జిబ్రాన్ ప్రత్యేక ట్రెండ్ని సృష్టించారు. 'సాహౌ చాప్టర్ 2'కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది కూడా జిబ్రానే కావడం విశేషం. 'రన్ రాజా రన్' వంటి సూపర్ హిట్ చిత్రం చేసినప్పుడు దర్శకుడు సుజిత్తో వర్క్ పరంగా జిబ్రాన్కు మంచి అనుబంధం ఏర్పడింది. ఇది భారీ ప్రాజెక్ట్ కావడంతో జిబ్రాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేందుకు ఎంపిక చేసుకున్నాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ని ఎలివేట్ చేసే విధంగా జిబ్రాన్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న గ్రాండ్గా వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం' అని తెలిపారు.