Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మైండ్ రీడర్ కథాంశంతో రూపొందించిన 'స్పెషల్' చిత్రం సమాజంపై బలమైన ప్రభావాన్ని చూపడం ఖాయం' అని అంటున్నారు దర్శకుడు శ్రీ వాస్తవ్. రంగా, అజయ్, అక్షిత ప్రధాన పాత్రధారులుగా శ్రీవాస్తవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'స్పెషల్'. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, 'సైంటిఫిక్ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. 'గజిని' తరహాలో ఉంటుంది. లవ్, యాక్షన్, రివేంజ్ ఇలా అన్ని అంశాలను మేళవించాం. తక్కువ బడ్జెట్లో ఓ పెద్ద సినిమా మాదిరిగా తెరకెక్కించాం. అజరు సినిమాకి రాకెట్ లాంఛర్ లాంటివారు. ఆయన కెరీర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. తన నటనతో విజృంభించారు. సినిమా చూశాక స్టోరీ, అజరు నటన ఫెంటాస్టిక్ అంటారు. సినిమాలో అజరు, రంగా పాత్రలకు సమాన స్థాయిలో హీరోయిన్ అక్షిత పాత్ర ఉంటుంది. ఆమె పాత్రతోనే సినిమా ప్రారంభమై, ఆమెతోనే ఎండ్ అవుతుంది. చిన్న సినిమాలకి కథ, కథనం, సంభాషణలు చాలా ముఖ్యం. అవి బలంగా ఉండాలి. ఇందులో అవన్నీ బలంగా అన్నీ బాగా కుదిరాయి. భారీ బడ్జెట్ సినిమా మాదిరి సమాజంపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ని చూపించే చిత్రమవుతుంది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది' అని అన్నారు.
హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ, 'తెలుగులో నాకిది రెండో చిత్రం. గతంలో 'శేఖరంగారి అబ్బాయి' చిత్రంలో నటించా. ఈ సినిమా కథ, నా పాత్ర నచ్చి నటించేందుకు ఒప్పుకున్నా. ఏ సినిమా చేసినా కథ, దర్శకుడికి ప్రాధాన్యతనిస్తాను. ఇందులో నేను బబ్లీగా, కాలేజ్ గోయింగ్ గర్ల్గా కనిపిస్తా. నా పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. సస్పెన్స్ జోనర్ నాకిష్టమైనది. అలాంటి సినిమాలో భాగం కావడం హ్యాపీగా ఉంది. దర్శకుడు వాస్తవ్ మంచి టాలెంటెడ్. మంచి కథతో వస్తున్నాం. సినిమాలో ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. మెయిన్గా అజరు, రంగా, నా పాత్ర, దర్శకుడు ఈ సినిమాకి నాలుగు పిల్లర్లుగా ఉంటాం. సినిమా అద్బుతంగా వచ్చింది. కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నా కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచే చిత్రంగానే కాదు గర్వంగా చెప్పుకునే చిత్రంగా నిలుస్తుంది' అని తెలిపింది.