Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనిష్క్ రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'. రిలీజ్కి రెడీ అవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ, 'క్రైమ్ సస్పెస్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాని రూపొందించాం. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందా అని సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. నటీనటులంతా చాలా బాగా నటించారు. నిర్మాత అన్ని విధాలుగా సపోర్ట్ చేయడంతోపాటు రాజీపడకుండా నిర్మించారు. అన్ని వర్గాలను అలరించే చిత్రమవుతుంది' అని అన్నారు. 'కష్టమైనా ఎంతో ఇష్టపడి సినిమాని రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ పనుల్లో ఉన్నాం. వచ్చే నెలలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్ సినిమాలని మించి ఉంటుంది' అని నిర్మాత క్రాంతి కిరణ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, ఎడిటర్: సత్యగిడుతూరి, సంగీతం: సిద్ధార్థ్ సదా శివుని.