Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కెరీర్ ప్రారంభంలో అవకాశాలివ్వండి అని చాలా మంది దర్శకుల చుట్టూ తిరిగా. ఇప్పుడదే దర్శకులు
మా సినిమాల్లో చేయండని కలుస్తున్నారు. బహుశా కాలం మారడమంటే ఇదేనేమో' అని అంటోంది కైరా అద్వానీ. 'ఫుగ్లీ' సినిమాతో బాలీవుడ్లోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది కైరా. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కైరాకి రెండేండ్ల వరకు ఒక్క ఛాన్స్ రాలేదు. అవకాశాల కోసం ఎంతో మంది దర్శక, నిర్మాతల చుట్టూ తిరిగిందట. ఫైనల్గా 'ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ'తోపాటు, 'భరత్ అనే నేను', 'వినయవిధేయ రామ'తో స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నటించిన 'కబీర్సింగ్' త్వరలోనే విడుదల కానుంది. ''ఎం.ఎస్.ధోనీ'తోపాటు దక్షిణాదిలో చేసిన సినిమాలు నన్ను తిరిగి పుంజుకునేలా చేశాయి. ఇప్పుడు నా చుట్టూ చాలా ఛాన్స్లు ఉన్నాయి ' అని కైరా తెలిపారు.