Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ కథానాయికలు తెలుగులో మెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కత్రినా కైఫ్, విద్యాబాలన్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. తాజాగా శ్రద్ధా కపూర్, అలియాభట్ తెలుగు ఆడియెన్స్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా వారి జాబితాలోకి ఐశ్వర్యారారు పేరు కూడా చేరబోతుందని సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఐష్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కథానాయిక కోసం అనేక పేర్లని చిత్ర బృందం పరిశీలించింది. నయనతార, శృతిహాసన్, కీర్తిసురేష్, తమన్నా పేర్లు నిన్నమొన్నటి వరకు వైరల్ అయ్యాయి. ఐష్ అయితే కొత్తగా ఉంటుంది, అలాగే మెగాస్టార్ ఇమేజ్కి సూటయ్యేలా ఉంటుందని భావించి ఆమెనే ఫైనల్ చేయబోతున్నారట. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే ఐశ్వర్య గతంలో నాగార్జున నటించిన 'రావోయి చందమామ' చిత్రంలో ఓ ఐటమ్ నంబర్లో మెరిసిన విషయం విదితమే.