Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో రామ్ మాట్లాడుతూ, 'సినిమాని ఇప్పటికే చూశా. చాలా బాగా వచ్చింది. థియేటర్లో చూసి ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తారు. సినిమాలో ప్రతి ఎలిమెంట్ని ఎంజారు చేస్తారు. దీని కోసం పనిచేసిన ఈ ఆరు నెలల కాలం నా లైఫ్లోనే బెస్ట్ టైమ్. ఆనీ మాస్టర్ కంపోజ్ చేసిన 'ఉండిపో ఉండిపో..' సాంగ్ ఆడియెన్స్ని కట్టిపడేస్తుంది. ఆమె ఆ సాంగ్ను అంత గొప్పగా కంపోజ్ చేశారు. మణిశర్మకి థ్యాంక్స్. సినిమాలో పాటలన్నీ ఒక ఎత్తు అయితే, రీరికార్డింగ్ మరో ఎత్తు. రాజ్తోట అద్భుతమైన విజువల్స్ అందించారు. నిధి, నభాలకు కృతజ్ఞతలు. ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. నిధి శంకర్ పాత్రకి సరిపోయేలా ఓ డేరింగ్ క్యారెక్టర్ను చేసింది. ఛార్మి లొకేషన్లో అందరి కష్టాలను తీసుకుని మా అందరినీ కూల్గా ఉంచింది. పూరీకి ధన్యవాదాలు. నాకు సినిమా ఎంత నచ్చిందో చెప్పాను. నేను ఫీల్ అయిన దాంట్లో ఒక శాతం అడియెన్స్ ఫీల్ అయినా నాకు అదే వంద శాతం సంతృప్తినిస్తుంది' అని అన్నారు. 'మణిశర్మ మా సినిమాకు పెద్ద పిల్లర్. అడగ్గానే ఐదు పాటలు నా మొహన కొట్టారు. రీసెంట్ టైమ్లో మంచి ఆల్బమ్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కుమ్మేశారు. సెన్సార్ పూర్తి కావాల్సి ఉంది. రామ్తో తొలిసారి కలిసి పనిచేశాను. తనలో ఎనర్జీ అన్లిమిటెడ్. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. నాకు చేతనైనంత వాడాను. ఇంకా బోలెడు ఎనర్జీ మిగిలుంది. మైండ్లో తన క్యారెక్టర్ రన్ అవుతూనే ఉంటుంది. రామ్ ఓ గ్రేట్ యాక్టర్. ఎన్టీఆర్కి 'టెంపర్' ఎలాగో, రామ్కి ఈ చిత్రం అలా గుర్తుండిపోతుంది. సినిమాలో ఆయన మాట్లాడిన తెలంగాణ యాస హైలైట్ అవుతుంది. ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్' అని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. నిర్మాత ఛార్మి చెబుతూ,'సినిమా ఫస్ట్ కాపీ చూశాం. కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. సినిమా సక్సెస్ అయిన ఫీలింగ్ వచ్చింది. నాకే కాదు, యూనిట్ అందరికీ అదే నమ్మకం ఏర్పడింది. చూసేవాళ్లందరికి సినిమా ఫుల్ మీల్స్లా ఉంటుంది. రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటన చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తను లేకుండా ఈ చిత్రం లేదు. వన్ మ్యాన్ షో చేశారు. పూరీ నెరేషన్ ఇచ్చినప్పుడు ఉన్న ఎనర్జీ సినిమాను తెరపై చూసినప్పుడు కూడా కనిపిస్తుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్, నభా నటేష్, డాన్స్ మాస్టర్ ఆనీ పాల్గొన్నారు.