Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాన్ అబ్రహం బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎక్కువగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ఆయన ప్రస్తుతం పలు భారీ, ఆసక్తికర యాక్షన్ చిత్రాలతో రాబోతున్నారు. 'బాట్లా హౌస్', 'పగల్పంటి' చిత్రాల్లో నటిస్తున్నారు.
దీంతోపాటు కొత్తగా 'ఎటాక్' అనే మరో యాక్షన్ ఎంటర్టైనర్కి గ్రీన్ సిగల్ ఇచ్చారు.
నూతన దర్శకుడు లక్ష్యా రాజ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నారు. ఇంటలిజెన్స్ నేపథ్యంలో ఆద్యంతం ఎంగేజింగ్గా సాగే కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభం కానుంది. దీన్ని తన జేఏ ఎంటర్టైన్మెంట్, కైటా ప్రొడక్షన్స్ పతాకాలపై ధీరజ్ వధవాన్, అజరు కపూర్లతో కలిసి జాన్ అబ్రహం నిర్మించనున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా జాన్ అబ్రహం నటించిన 'బాట్లా హౌస్' ఆగస్ట్ 15న విడుదలవుతోంది.