Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భారీ బడ్జెట్ చిత్రాల కంటే ఇప్పుడు చిన్న చిత్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే పెద్ద ప్రొడక్షన్స్ కూడా లో-బడ్జెట్ సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నాయి' అని అంటున్నారు నిర్మాతలు మధుర శ్రీధర్, యష్ రంగినేని. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన 'దొరసాని' చిత్రాన్ని మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి నిర్మించారు. శుక్రవారం విడుదలైన సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో శనివారం నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్ మాట్లాడుతూ,
'1987 తెలంగాణ పల్లెటూరు బ్యాక్డ్రాప్లో పొయెటిక్ మ్యూజిక్ లవ్ స్టోరీ ఇది. సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. స్వచ్చమైన ప్రేమ కథా చిత్రంగా ఆడియెన్స్ బాగా ఎంజారు చేస్తున్నారు. సినిమా ఓపెనింగ్స్ అంతగా లేకపోయినా ఆ తర్వాత పుంజుకుంది. తెలంగాణలో కంటే వైజాగ్, విజయవాడలో మంచి కలెక్షన్లు ఉన్నాయి. తెలుగులో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలను ఎక్కువగా తమిళ దర్శకులు రూపొందించారు. కానీ తెలుగు దర్శకుడు ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కథని తీయడం ఇదే మొదటసారి. ఆనంద్ కొన్ని సన్నివేశాల్లో న్యూడ్గానూ నటించారు. చిన్న వయసులో ఇంత బరువైన పాత్ర దక్కినందుకు అదృష్టంగా ఫీలవుతున్నా అని శివాత్మిక సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాని 'సైరత్'తో పోల్చుతున్నారు. కానీ ఏ సంబంధం లేదు. మేం ఊహించని ఫలితం వచ్చింది. ఇటీవల వరుసగా మంచి సినిమాలొచ్చాయి. జనాలు చూశారు. వారి ఆకలి తీరింది. అందుకే మా సినిమాకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎప్పుడైనా ఆకలి(సినిమా చూడాలనే కోరిక)గా ఉన్నప్పుడు ఇలాంటి సినిమా వస్తే ఆదరించేవారు. ప్రస్తుతం మన వద్ద ఉన్న థియేటర్లకు కంటెంట్ సరిపోవడం లేదు. వారికి రెగ్యులర్గా కంటెంట్ కావాలంటే ఏడాదికి 300 సినిమాలు కావాలి. దాదాపు 200 సినిమాలు వస్తున్నా, థియేటర్లోకి వచ్చే చిత్రాలుగా ఉండటం లేదు. మంచి కంటెంట్తో ఉన్న చిన్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే నేను బలమైన కథా నేపథ్యంతో కూడిన చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నా. త్వరలో మా కాంబినేషన్లో రెండు మూడు స్క్రిప్ట్లున్నాయి. అలాగే నా దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది' అని అన్నారు.
'సినిమాకి ఫ్రెష్ లుక్ కోసం 60 మంది కొత్తవాళ్ళని పరిచయం చేశాం. దర్శకుడి ఒత్తిడి మేరకు నేను కూడా నటించా. సినిమా చూసినప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగిందంటూ ప్రశంసిస్తున్నారు. నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. ఎక్కడా పొల్యూట్ కానివ్వలేదు. 'పెళ్ళి చూపులు' అంతటి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాం. మౌత్టాక్ బాగుంది. నేను 'పెళ్ళిచూపులు'తో నిర్మాతగా మారాను. ఆ టైమ్లో నిర్మాత కావాలని విజరు దేవరకొండ అడిగిన వెంటనే నాకున్న సినిమా ఇంట్రెస్ట్తో ప్రొడ్యూస్ చేశాను. అప్పటికీ విజరు నటుడిగా నిలబడతాడా లేదా అనుకున్నాం. ఇంత పెద్ద హీరో అవుతాడనుకోలేదు' అని మరో నిర్మాత యష్ రంగినేని చెప్పారు.