Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శ్రీరామరాజ్యం'లో సీతగా నయనతార అత్యద్భుత నటనతో, హావభావాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. సీత అంటే ఇలానే ఉంటుందా అనేంతగా పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పుడు మరోసారి సీతగా నయనతార ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి గీతా ఆర్ట్స్పై 1500కోట్ల భారీ బడ్జెట్తో రామాయణాన్ని తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. 'శ్రీరామ రాజ్యం'లో సీతగా నటించిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని నయనతార అయితే ఈ చిత్రానికి బాగా సూట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. మరోవైపు సీత పాత్ర కోసం అనుష్క పేరు కూడా వినిపిస్తుంది. నయనతార కాదంటే అనుష్కతో వెళ్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది. త్రీడీలో రూపొందించే ఈ చిత్రాన్ని 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ, 'మామ్' ఫేమ్ రవి ఉద్యవార్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు.