Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రేక్ చేస్తా'హీరోయిన్ అంటే మంచి గ్లామరస్ రోల్స్ చేయాలి. డబ్బులు సంపాదించుకోవాలి.
ఆ తర్వాత ఇండిస్టీ నుంచి వెళ్ళిపోవాలనే ట్రెండ్ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నా.
ఈ ధోరణిలో మార్పు తీసుకొచ్చేందుకు నా వంతుగా ప్రయత్నం చేస్తున్నా' అని అంటోంది అమలాపాల్. తాజాగా తమిళంలో 'ఆడై' చిత్రంలో అమలాపాల్ నటించింది.
ఇది తెలుగులో 'ఆమె' పేరుతో ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా
మంగళవారం అమలాపాల్ మీడియాతో మాట్లాడుతూ, 'చాలా గ్యాప్తో తెలుగులో వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ గ్యాప్లో తెలుగులో కూడా చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ ఏదీ సంతృప్తినివ్వలేదు. ఈ కథ బాగా నచ్చి ఎలాగైనా ఇందులో భాగం కావాలనుకున్నాను.
కొత్తగా, నిజాయితీగా ఉంటుంది. ఇందులో కామిని అనే పాత్ర పోషించా. స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిని. గ్రే షేడ్లో నా పాత్ర ఉంటుంది. చాలా హైపర్, సెల్ఫీష్గా ఉంటాను.
నా రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది. ఈ పాత్రలో నటించడాన్ని బాగా ఎంజారు చేశాను. సినిమాలో యాక్షన్ కూడా ఉంటుంది. దానికోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అయితే ఓ సీన్లో న్యూడ్గా నటించాను. అది వల్గర్గా ఉండదు. కథ డిమాండ్ మేరకే ఉంటుంది. సినిమాని ఓ ప్రయోగాత్మకంగా చేశాం. సింక్ సౌండ్, రియల్ లొకేషన్లు ఉపయోగించాం. కచ్చితంగా అందరికి నచ్చుతుంది. నటిగా రెగ్యులర్, స్టీరియోటైప్ సినిమాలు చేయాలనుకోవడం లేదు. కొత్తగా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, రియలిస్టిక్ కథలను, లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలనుకుంటున్నా. ప్రతి నటికి ఓ ఫేజ్ ఉంటుంది. నాకు 'మైనా'తో పెద్ద హిట్ వచ్చింది.
పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చాయి. స్టార్ హీరోలతో, పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశాలు వచ్చాయి.
దీంతో కెరీర్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అది మారింది. మహిళా ప్రధానమైన, డిఫరెంట్గా ఉండే సినిమాలొస్తున్నాయి. కొన్ని సినిమాలు చేయడం వల్ల వాటితోపాటు మనం కూడా ఎదుగుతుంటాం. అలాంటి సినిమాలను చేయాలనుకుంటున్నా. అలాగని ఆర్ట్ సినిమాలు కాదు.
ప్రయోగాత్మక కథలని చెప్పాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం 'అదో అంధా పారవై పోలా',
'ఆడుజీవితం' చిత్రాల్లో నటిస్తున్నా. దీంతోపాటు 'కడవార్' చిత్రంతో నిర్మాతగా మారుతున్నా.
యదార్థ సంఘటన ఆధారంగా ఫోరెన్సిక్ థ్రిల్లర్గా ఇది రూపొందుతోంది' అని చెప్పారు.