Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలక్షణ పాత్రలతో నట విశ్వరూపం చూపిస్తున్న జగపతిబాబు తాజాగా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాశ్మీర్లో ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రం నుంచి జగపతిబాబు తప్పుకున్నారని వినిపిస్తోంది. అలాగే ఆయన స్థానంలో ప్రకాష్రాజ్ని ఎంపిక చేశారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ఈ సినిమా నుంచి జగపతిబాబు ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది. విజయశాంతి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్గా విడుదల చేయబోతున్నారు.