Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. 'రొమాంటిక్ ఎంటర్టైనర్గా సినిమాని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం నాగ్ డబ్బింగ్ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్కి అత్యద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇన్నోసెంట్గా, రొమాంటిక్ లవర్ బారులా నాగార్జున మెప్పిస్తున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న అవంతిక క్యారెక్టర్ టీజర్ విశేషంగా అలరిస్తుంది. సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ని ప్రకటిస్తాం. చైతన్ భరద్వాజ్ సమకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఆగస్ట్ 9న సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తాం' అని చిత్ర బృందం తెలిపింది.