Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ సినీ కార్మికులకు ఉపాథి కల్పిస్తూ తనే ఓ మినీ ఇండిస్టీగా నిలిచిన అక్షరు కుమార్ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా ముందున్న సందర్భాలు కోకొల్లలు. ఆ మధ్య పుల్వామా దాడి ఘటనలో చనిపోయిన వీరజవాన్లకు తన వంతు భారీ విరాళం అందించారు. తాజాగా అస్సోం వరద బాధితులకు తన వంతు సాయంగా రూ. రెండు కోట్ల సాయం చేశారు. 'ఈ ప్రకృతి వైపరిత్యం చూసి నా మనసు చలించిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో బాధితులకు, జంతువులకు మనం చేయూతగా ఉండాలి.
మీ వంతు సాయం చేయండి' అని తెలిపారు.
అలాగే తెలుగు కథానాయకుడు సుధీర్బాబు కూడా తన వంతు సాయాన్ని పంపించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'అస్సోం కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. చిన్నదా, పెద్దదా అనేది ముఖ్యం కాదు. సహాయం చేసే చేతులకు ఎక్కువ, తక్కువ అనేది ఉండదు. మీరూ ఇందులో భాగం కావాలని కోరుతున్నా' అని చెప్పారు.