Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'దేవినేని' (బెజవాడ సింహం). శివనాగు దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిల్మ్స్ పతాకంపై రాము ర్యాథోడ్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'ప్రస్తుతం బయోపిక్ల ట్రెండ్ నడుస్తుంది. అందులో 'దేవినేని' హాట్ టాపిక్ అయ్యింది. 1980లో బెజవాడలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచిన ఇరువురు ఉద్ధండులైన రాజకీయ నాయకులు దేవినేని, వంగవీటి రంగాల కథతో రియలిస్టిక్గా తెరకెక్కిస్తున్నాం. దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా, వంగవీటి రంగా పాత్రలో 'సంతోషం' ఎడిటర్ సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్కి మంచి స్పందన లభిస్తుంది. తాజాగా మరో కీలక పాత్రధారి అయిన వంగవీటి రంగా భార్య రత్నకుమారి లుక్ని విడుదల చేశాం. రత్నకుమారి పాత్రలో తమిళనటి ధృవతార అద్భుతంగా నటించారు. తాజాగా రివీల్ చేసిన ఫొటోలో రంగాతో సతీమణి రత్నకుమారి అన్నోన్యతను ఎలివేట్ చేశార. బెజవాడ రాజకీయాల్లో ఎదురేలేని నాయకుడిగా పేరున్న రంగాకు నిరంతరం ఎన్నో సవాళ్లు ఎదురయ్యేవి. అలాంటి సమయంలో ఎంతో ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొన్న గొప్ప భార్యగా రత్నకుమారి గురించి చరిత్ర చెబుతోంది. రంగా కాపునేతగా గుర్తింపు పొందినప్పటికీ, తన ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన రత్నకుమారిని పెళ్లాడి కులం అడ్డుగోడ చెరిపేయడం విశేషం. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి అందరివాడయ్యారు. అందుకే చరిత్రలోనూ నిలిచారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రధాన భాగం పూర్తయ్యింది. మరో రెండు షెడ్యూల్స్తో ఈ చిత్రం పూర్తవుతుంది' అని అన్నారు.