Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రధారులుగా నగేష్ కుకునూర్
దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు కూడా భాగమయ్యారు. దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'క్రీడా నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ చిత్రమిది. 'హైదరాబాద్ బ్లూస్', 'ఇక్బాల్' వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్లో చివరి షెడ్యూల్ని చిత్రీకరించనున్నాం. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు సపోర్ట్ చేయడంలో ముందుండే దిల్రాజు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని చెప్పింది. రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ దాస్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు.