Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్ హాసన్ నటిస్తున్న 'శభాష్ నాయుడు' పలు కారణాలతో ఆగిపోయింది. శంకర్ దర్శకత్వంలో రూపొందాల్సిన 'భారతీయుడు 2' సైతం ప్రస్తుతం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కమల్ మరో సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా 'తలైవన్ ఇరుక్కిండ్రాన్' చిత్రాన్ని రూపొందించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్తో కలిసి తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడం విశేషం. 19 ఏండ్ల తర్వాత కమల్ హాసన్, ఏఆర్ రెహ్మాన్ మళ్ళీ కలిసి పనిచేస్తున్న చిత్రమిది. చివరగా 'తెనాలి' (2000)చిత్రానికి పనిచేశారు. 'ఒకే ఒక వ్యక్తి కమల్హాసన్ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంలో పనిచేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా, హ్యాపీగా ఉన్నా' అని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రెహ్మాన్ షేర్ చేసుకున్నారు. దీనిపై కమల్ స్పందిస్తూ, 'మీరు మా టీమ్లో భాగమై మాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. కొన్ని ప్రాజెక్ట్లు మంచి అనుభూతినిస్తాయి. అలాంటి ప్రాజెక్ట్ ఇది. మీతో పనిచేయడం కోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం' అని చెప్పారు.