Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పరిశోధన లేనిదే సైన్స్ లేదు. రీసెర్చ్ చేయకుండా మనకి మనం శాస్త్రవేత్తలం అని చెప్పుకోలేం' అని అక్షరు కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరు కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'మిషన్ మంగళ్'. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ గురువారం విడుదలైంది. 2013లో భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మంగళ్యాన్' మిషన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. అంగారకుడిపైకి మంగళ్యాన్ ఉపగ్రహాన్ని పంపాలని శాస్త్రవేత్త రాకేష్ ధావన్ ప్రతిపాదిస్తారు. రాకేష్ ధావన్ పాత్రలో అక్షరు కుమార్ నటించారు. ట్రైలర్లో రాకేష్ పాత్రధారి అయిన అక్షరు ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు 'ఇది చేయడానికి అనుభవజ్ఞులు కావాలి సర్' అని శాస్త్రవేత్త తారా షిండే పాత్రధారి విద్యా బాలన్ అంటారు. అందుకు అక్షరు బదులిస్తూ, 'అంగారకుడిపైకి వెళ్ళడానికి ఇస్రోలో ఎవరికి అనుభవం ఉంది. ఏదేమైనా మంగళ్యాన్ని మార్స్పైకి పంపి తీరాల్సిందే' అని ఆవేశంగా అనడం, ఆ తర్వాత చోటు చేసుకునే సంఘర్షణ, అంతిమంగా శాస్త్రవేత్తలంతా కలిసి దేశ చరిత్రలో నిలిచిపోయిన మంగళ్యాన్ని విజయవంతంగా ప్రయోగించడం ట్రైలర్లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీన్ని స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలో అక్షరు మాట్లాడుతూ, 'మొదటి స్పేస్ బేస్డ్ చిత్రంలో అవకాశం వస్తే ఎవరూ నో చెప్పరు. ఈ చిత్ర కథని జగన్, బాల్కీ నెరేట్ చేసిన వెంటనే ఎస్ చెప్పాను. నా కెరీర్లో ఇంత వేగంగా ఎస్ చెప్పిన చిత్రమిదే కావడం విశేషం. ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమవుతుంది' అని తెలిపారు.