Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో
ఏ హవీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'రాక్షసుడు'. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమాని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, ''కవచం' సినిమా టైమ్లో రమేష్ వర్మ తమిళ 'రాక్షసన్' సినిమా గురించి చెప్పారు. ఆ చిత్రంలో నాది పోలీస్ పాత్ర. ఇందులో కూడా పోలీస్ రోల్ చేయడం ఇష్టం లేక ఆసక్తి చూపించలేదు. సినిమా చూశాక బాగా నచ్చింది. ఎలాగైనా ఈ సినిమా చేయాలనుకున్నా. సామాజిక అంశాల మేళవింపుగా థ్రిల్లర్ ప్రధానంగా సాగే అద్భుతమైన చిత్రమిది. అందరిలోనూ అవగాహన కల్పించేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత కోనేరు సత్యనారాయణ రాజీపడకుండా నిర్మిస్తున్నారు. రమేష్ వర్మ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. సినిమా బాగా వచ్చింది' అని అన్నారు. 'నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన కోనేరు సత్యనారాయణకి, బెల్లంకొండ సురేష్కి థ్యాంక్స్. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన హీరో సాయి శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నీషియన్కి కృతజ్ఞతలు' అని దర్శకుడు తెలిపారు. 'తమిళ చిత్రం 'రాక్షసన్' బాగా నచ్చింది. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలను అందరికీ నచ్చేలా రీమేక్ చేయడం చాలా కష్టం. దర్శకుడు రమేష్ వర్మ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని తెరకెక్కించాడు. దీనికి తగ్గట్టు పవర్ఫుల్ పోలీస్ అధికారిగా బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతంగా చేశాడు. ఇంత భారీ స్థాయిలో, ఎక్స్ట్రార్డినరీ విజువల్స్తో సినిమాని 90 రోజుల్లోనే పూర్తి చేశాం. చాలా రిచ్గా మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్తో నిర్మించాం. టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. ఒక మంచి సినిమాని తీశామనే తృప్తి కలిగింది. సినిమా నచ్చి అభిషేక్ నామా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు' అని నిర్మాత చెప్పారు. 'ఎంగేజింగ్ థ్రిల్లర్ చిత్రమిది. తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. సాయిశ్రీనివాస్ కెరీర్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. డైరెక్టర్గా సరికొత్త రమేష్ వర్మని చూస్తారు. సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని అభిషేక్ నామా తెలిపారు.