Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏడు చేపల కథ' ఫేమ్ అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంటగా, జీఎన్ఎస్పీ కళ్యాణ్ దర్శకత్వంలో జి.చరితారెడ్డి నిర్మాతగా లక్ష్మి చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్పీకే స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'వైఫ్ ఐ'. 'నైఫ్ బెటర్ దెన్ వైఫ్' అనేది ట్యాగ్లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కళ్యాణ్ మాట్లాడుతూ, 'ఇప్పటి సమాజంలో జరుగుతున్న ఒక మంచి పాయింట్ని చాలా ఎంటర్టైనింగ్గా తెరకెక్కించాం. భార్య, భర్త మధ్య ఉండే అన్ని రసాల కలబోతగా, పూర్తి రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్న అసూయ ద్వేషాలు, ఎప్పటికో కనిపించే ప్రేమ, దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవన్నీటికి మించి వారి జీవితాలు ఎలా ఉంటాయనేది అందంగా మంచి కంటెంట్తో తెరకెక్కించాం. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నాం' అని అన్నారు. 'ఇలాంటి కథలు ఈ జెనరేషన్లో రావాలి. అందరూ తప్పకుండా చూడాలి. వైవాహిక జీవితాలు నాశనం అయిపోతున్న రోజులివి. భార్యాభర్తల మధ్య ప్రేమలు పోయి అసూయలు పెరుగుతున్న రోజులివి. అసలు వీటి కారణం తెలుసుకోలేకపోతున్నారనే పాయింట్ నాకు బాగా నచ్చింది' అని నిర్మాత తెలిపారు.