Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏనుగంటి దర్శకత్వంలో రజిత్, త్రిషాలాషా జంటగా ఆదిలక్ష్మి, భాస్కర రావు సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ధమ్కీ'. శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ, 'వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా రూపొందింది. ఈ చిత్రంలో బిత్తిరి సత్తి కామెడీ ప్రేక్షకులని ఆద్యంతం అలరిస్తుంది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత సినిమాను ఎంతో ఫ్యాషన్తో నిర్మించారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకు ప్రధాన బలం' అని అన్నారు. 'చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నేను కథని నమ్మిన విధంగా దర్శకుడు ఏనుగంటి యాక్షన్కి పెద్ద పీట వేస్తూ చాలా బాగా తెరకెక్కించారు. గ్రాఫిక్స్ వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలు, ఫైట్స్ అన్ని ఖర్చుకు వెనకాడకుండా ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతి ఇచ్చే విధంగా తెరకెక్కించాం. రామ్ లక్ష్మణ్ ఫైట్స్తోపాటు శ్రీమణి సాహిత్యం మా సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ చిత్ర విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాత సత్య నారాయణ సుంకర చెప్పారు. శ్రవణ్, అజరు, శ్రీనివాస రెడ్డి, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: దీపక్ భగవంత్, సంగీతం: ఎస్.బి.ఆనంద్, ఎడిటర్: చోట కె ప్రసాద్.