Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్బాబు, రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై దిల్రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల కాశ్మీర్లో ప్రారంభమైన తొలి షెడ్యూల్ షూటింగ్ శుక్రవారంతో ముగిసింది. ఇందులో మహేష్బాబు ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. కాశ్మీర్లో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో రాజేంద్రప్రసాద్ వంటి పలువురు కీలక పాత్రధారులు పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్లో రెండో షెడ్యూల్ని జరుపనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. 'కాశ్మీర్లో మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. సూపర్స్టార్ మహేష్బాబుతో పనిచేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియెన్స్. రెండో షెడ్యూల్ని ప్రారంభించేందుకు వెయిట్ చేయలేకపోతున్నా' అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్గా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి జగపతిబాబు తప్పుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం విదితమే. దీనిపై అటు జగపతిబాబు, ఇటు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అనుకోని కారణాల వల్ల తప్పుకున్నట్టు జగపతిబాబు వెల్లడించారు.