Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉంది. తాజాగా వాయిదా పడింది. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'బాహుబలి' తర్వాత వస్తున్న చిత్రం కావటంతో రెబల్స్టార్ ఫ్యాన్స్తో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్కి పూర్తి వినోదాన్ని క్వాలిటితో అందించాలని నిర్ణయించుకున్నాం. హైస్టాండర్డ్ వీఎఫ్ఎక్స్ని ఉపయోగించి చేయడం వల్ల హడావుడి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ని పరిగణలోకి తీసుకుని ఈ చిత్రానికి సంబందించిన వర్క్ జరుగుతుంది. మా బ్యానర్లో వచ్చిన అన్ని చిత్రాలు క్వాలిటీకి కేరాఫ్గా నిలిచాయి. మరి ఇప్పుడు చేస్తున్న 'సాహో' అంతే అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం. ఇంత లార్జ్ స్కేల్లో వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకులకి బెస్ట్ ఇవ్వాలన్నదే మా ప్రయత్నం. అందుకే కొంచెం ఆలస్యమైనా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి తీరాలని నిర్ణయించుకున్నాం. ఆగస్ట్ 30న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజరు, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.