Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సాహస వీరుడు సాగర కన్య', 'అజాద్' చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ని మెస్మరైజ్ చేసిన శిల్పా శెట్టి దాదాపు 12ఏండ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. చివరగా 2007లో 'అప్నే'లో నటించారు. పెళ్ళి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ప్రస్తుతం దిల్జిత్ దోసాంజే, యామీ గౌతమ్ జంటగా నూతన దర్శకుడు అజిజ్ మీర్జా దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారట. ఇందులో ఆమె రైటర్గా కనిపించనుందని చిత్ర బృందం తెలిపింది. 'ఈ సినిమాలో శిల్పా రచయితగా కనిపించనున్నారు. ఆగస్ట్ మొదటి వారంలో ఆమె చిత్ర షూటింగ్లో పాల్గొంటారు. ఈ షూటింగ్లో పాల్గొనేందుకు శిల్పా ఎగ్జైటింగ్గా ఉన్నారు' అని తెలిపింది.