Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, అన్యా సింగ్ జంటగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిను వీడని నీడను నేనే'. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో శనివారం చిత్ర బృందం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'సినిమా చాలా బాగా ఉందని. టూర్ వెళ్ళినప్పుడు చాలా మంది కలిసి ప్రశంసించారు. మదర్ సెంటిమెంట్ బాగుందంటున్నారు. సినిమాకి సోల్ అమ్మానాన్న ప్రేమ. అది జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఓ పెద్దావిడ కలిసి 'మూడు నెలల క్రితం లవ్ ఫెయిల్యూర్ వల్ల మా అబ్బాయి చనిపోయాడు. ఇది మూడు నెలలకు ముందు విడుదలై ఉంటే, ఈ సినిమా చూసుంటే మా అబ్బాయి బతికేవాడేమో' అంది. ఆ మాటకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అదే పెద్ద ప్రశంసగా భావిస్తున్నా. డబ్బులు రావాలని కాకుండా, మంచి సినిమా తీయాలని,
అందరు సేఫ్గా ఉంటే చాలనుకుని చేశాం. ఇప్పుడు బయ్యర్స్, నిర్మాతలు సేఫ్ అయ్యారు. వారంతా హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రంతో పెద్ద హిట్ కొట్టాం. దర్శకుడు ఈ ఫంక్షన్లో లేకపోవడం బాధగా ఉంది. థమన్కి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు హిట్ ఇవ్వడం కోసం పోరాడాడు. సినిమా కోసం బ్లడ్ పెట్టి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు. త్వరలో మా టీమ్తో కొత్త సినిమా చేయబోతున్నాం. ఈ సినిమాని సక్సెస్ చేసి, నాపై నమ్మకాన్ని ఇచ్చిన ఆడియెన్స్కి థ్యాంక్స్' అని చెప్పారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ తెలియజేస్తూ, 'కొన్ని సినిమాలు కమర్షియల్గా కాకుండా మనుషుల కోసం చేస్తాం. సందీప్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అందరం కలిసి ఆయన్ని గెలిపించాలని ఈ సినిమా చేశాం. దర్శకుడు కార్తీక్ రాజు బ్రిలియంట్. కథ చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. డిఫరెంట్గా ఉంది. ట్రై చేద్దామనుకున్నా. ప్రస్తుతం నేను సందీప్కి సక్సెస్ వచ్చిన షాక్లో ఉన్నా. చాలా హ్యాపీగా ఉంది. ఇన్వెస్ట్ చేసిన వారంతా హ్యాపీగా ఉన్నారు.
సందీప్ గెలిచాడు. ఇలాంటి స్క్రిప్ట్ చేయడానికి ధైర్యం కావాలి. సందీప్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి' అని చెప్పారు. 'ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ఆడియెన్స్కి థ్యాంక్స్.
సందీప్, సీతారామ్ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. తమన్ పాటలు ట్రెండ్ అవుతున్నాయి. అన్యాకి మంచి ఆఫర్స్ వస్తాయి' అని నిర్మాత దయా చెప్పారు.