Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం తెలుగు సినిమాకి గ్రేట్ టైమ్ నడుస్తోంది. ప్రతి ఒక కాన్సెప్ట్ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. దీంతో అందరికీ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్' అని సమంత అన్నారు. అడివి శేషు, రెజీనా జంటగా వెంకట్ రామ్జీ దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎవరు'. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర టీజర్ను సమంత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'టీజర్ బాగా నచ్చింది. సినిమాపై ఆతృత పెరిగింది. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంది. డైరెక్టర్ వెంకట్ కొత్తవాడని ఎవరూ అనుకోరు. అంత అద్భుతంగా తెరకెక్కించారు. కొత్త కంటెంట్ సినిమాతో అడివిశేష్ ఇండిస్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. తన నుంచి మరిన్ని వినూత్నమైన సినిమాలొస్తాయని ఆశిస్తున్నా. రెజీనా మంచి నటి. నవీన్చంద్ర సహా చిత్ర బృందానికి అభినందనలు' అని అన్నారు. 'సాధారణంగా ప్రతి సినిమాకి కొంత మంది మెయిన్ పిల్లర్స్ ఉంటారు. ఈ సినిమాకి మొదటి పిల్లర్ పీవీపీ. స్టోరీ డెవలప్మెంట్, స్క్రిప్ట్ రైటింగ్లో నేను, శేష్, అబ్బూరి రవి కలిసి ట్రావెల్ అయ్యాం. మేం రెండో పిల్లర్. ఇక మూడో పిల్లర్ మా నటీనటులు. శేష్, నవీన్, రెజీనా అద్భుతంగా నటించారు. నాలుగో పిల్లర్ మా టెక్నికల్ టీమ్. వంశీ, గ్యారీ, శ్రీచరణ్ ఇలా అందరూ నా కోసం పనిచేశారు. వారి ప్రేమను చూశాను. ఇంత మంచి టీమ్తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అని చిత్ర దర్శకుడు తెలిపారు. హీరో అడివిశేష్ మాట్లాడుతూ, 'మా టీజర్ను విడుదల చేసిన సమంతకు థ్యాంక్స్. ఆమెలో పాజిటివ్ వైబ్సే లక్గా మారుతున్నాయి. ఇదొక ఎమోషనల్ జర్నీ. 'క్షణం' ముందు వరకు నన్ను అందరూ విలన్గా చూశారు. మెయిన్ లీడ్గా ఎవరూ చూడలేదు. అలాంటి సందర్భంలో నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి పీవీపీ. ఆయనకు ధన్యవాదాలు. నాకు నచ్చిన జోనర్ థ్రిల్లర్. ఇది కూడా థ్రిల్లర్ ప్రధానంగా సాగే సినిమా. వెంకట్తో 'ఈ సినిమాలో పెట్టే ప్రతి షాట్ లాస్ట్ షాట్ అనేలా మనుసు పెట్టి చెరు' అన్నాను. నేనెప్పుడూ మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. ఎందుకంటే మనం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉండిపోతుంది. ఆ నమ్మకంతో తీసిన చిత్రమిది. ఫస్ట్ ఆగస్ట్ 23న రిలీజ్ చేయాలనుకున్నాం. 'సాహో' అనే పెద్ద తుఫాన్ని తట్టుకుని రిలీజ్ చేయాలనుకున్నాం. ఆ సినిమా వాయిదా పడటంతో ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ, 'ఇందులో చాలా మంచి పాత్ర పోషించా. టీజర్ని ఎలా ఎంజారు చేశారో, సినిమాని కూడా అంతకంటే బాగా ఎంజారు చేస్తారు' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రాఫర్ వంశీ, ఎడిటర్ గ్యారీ, రైటర్ అబ్బూరిరవి, నిహాల్, రాజా రవీంద్ర, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.