Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు జాతి మరచిపోలేని, మరచిపోకూడని గొప్ప నటుడు ఎస్వీరంగారావు. అలాంటి ఓ గొప్ప కళాకారుడి చరిత్రని భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మహానటుడు ఎస్వీరంగారావుపై సినీ పరిశోధకులు సంజరు కిషోర్ రచించి, సేకరించి, రూపొందించిన 'మహానటుడు' ఫొటో బయోగ్రఫీ పుస్తక రూపకల్పనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం హైదరాబాద్కి విచ్చేసిన వెంకయ్యనాయుడికి రచయిత సంజరుకిషోర్ పుస్తకాన్ని బహుకరించారు. ఈ పుస్తకం ప్రస్తుతమే కాదు రాబోయే తరాలకూ ఎంతో ఉపయోగకరం. సుదీర్ఘకాలం శ్రమించి, ఆకర్షణీయంగా ఈ పుస్తకాన్ని రూపొందించిన సంజరు ప్రయత్నం అభినందనీయమంటూ ఆయన్ని శాలువతో ఉపరాష్ట్రపతి సత్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో గాయకుడు డా|| బంటీ, ఇండియన్ రైల్వేస్ ఉన్నతాధికారి రవిపాడి పాల్గొని సంజరుకిషోర్ ప్రయత్నాన్ని కొనియాడారు.