Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనివాస్ సాయి, భావన రావు జంటగా అజరు సాయి మనికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యా ప్రసాద్, అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మథనం'. ఈ చిత్ర టీజర్ లాంచ్ సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు సురేందర్రెడ్డి దంపతులు టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా సురేందర్రెడ్డి మాట్లాడుతూ, 'నిర్మాత అశోక్ దాదాపు 15ఏండ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. నాతోపాటు కథా చర్చల్లో కూడా పాల్గొనేవాడు. సినిమాల్లో రాణించాలని చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత మధ్యలో వదిలేసి అమెరికా వెళ్ళి బాగా సంపాదించారు. ఏడేండ్ల తర్వాత సడెన్గా వచ్చి సినిమా చేస్తున్నానని చెప్పిన ఆయన గట్స్ని మెచ్చుకోవాలి. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. కథే సినిమాకి ప్లస్ అవుతుంది. సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో అశోక్ పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా. అలాగే నాతో కూడా సినిమా చేయాలి. దర్శకుడు అజరు నా సినిమాలకి కొరియోగ్రఫీ చేశారు. భవిష్యత్లో పెద్ద దర్శకుడు కావాలి. హీరోహీరోయిన్లు బాగా నటించారు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'మంచి మార్కెట్ ఉన్న హీరోకి పెట్టాల్సినంత బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు నేనెవరో అందరికి తెలియదు. ఈ చిత్రం తర్వాత అంతా 'మథనం' సాయి అంటారు. నా కెరీర్ 'మథనం'కి ముందు, 'మథనం'కి తర్వాత అనేలా ఉంటుంది' అని హీరో శ్రీనివాస్ సాయి తెలిపారు. చిత్ర దర్శకుడు అజరు సాయి చెబుతూ, 'దర్శకుడిగా సురేందర్రెడ్డి నాకు గురువు. 'యువత' సినిమా ద్వారా నన్ను కొరియోగ్రాఫర్గా పరిచయం చేసిన దర్శకుడు పరుశురామ్కి థ్యాంక్స్. ఒక ఐడియా, సీన్ విని నిర్మాత అశోక్ ఈ సినిమాని నిర్మించేందుకు రెడీ అయ్యారు. విందా, కోటగిరి వెంకటేశ్వరరావు, జానీ వంటి సాంకేతిక నిపుణులతోపాటు సాయి, భావన చాలా బాగా చేశారు. ఒక జెన్యూన్ ఫిల్మ్ చేశాం. ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలని మథన పడుతున్న సమయంలో సత్య ఈ టైటిల్ చెప్పారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు' అని తెలిపారు. జెన్యూన్గా, నిజాయితీగా చేసిన చిత్రమిది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని నిర్మాత అశోక్ అన్నారు.