Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయికేతన్, మేరీ జంటగా అజ్గర్ అలీ దర్శకత్వంలో ఎస్కేఎంఎల్ పతాకంపై ఆదినారాయణ నిర్మిస్తున్న చిత్రం 'వైకుంఠపాళి'. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. అతిథిగా విచ్చేసిన నిర్మాత కె.యస్.రామారావు పాటల సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ సినిమాల పట్ల ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన థాట్స్ విభిన్నంగా ఉంటాయి. ఈ చిత్ర టైటిల్, ట్రైలర్ ప్రతిదీ కొత్తగా ఉంది. కొత్త కాన్సెప్ట్స్ని ఆదరిస్తున్న తరుణంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధించి చిత్ర యూనిట్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు అజ్గర్ అలీ మాట్లాడుతూ, 'ఈ సినిమా విడుదల వరకు వచ్చిందంటే కారణం మా నిర్మాత ఆదినారాయణ. కొత్త వారమైనా ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సినిమా బాగా రావడానికి సహకరించారు. ఓ కొత్త పాయింట్తో ఈ చిత్రాన్ని తీసాం. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం' అని చెప్పారు. 'ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్పై రాని హర్రర్ గేమ్ ఇది. సాయికేతన్ ఇందులో అండర్ కవర్ కాప్గా నటించాడు. నేను రాసుకున్న కథకు మా దర్శకుడు పూర్తి న్యాయం చేశాడు. మా సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తైంది. ఈ నెల 23న గ్రాండ్గా సినిమాను విడుదల చేస్తున్నాం. దీంతోపాటు 'మిస్టర్ లోన్లీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్ర లోగోని కూడా కె.ఎస్.రామారావు ఆవిష్కరించడం హ్యాపీగా ఉంది' అని నిర్మాత తెలిపారు.