Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లామరస్ పాత్రలతో మెప్పిస్తూ అగ్ర కథానాయికగా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ భారీ బంపర్ ఆఫర్ అందుకుంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న 'భారతీయుడు 2'లో కథానాయికగా ఎంపికైందని సమాచారం. ఇందులో ఇప్పటికే కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. కథానుగుణంగా మరో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందట. అందులో రెండో కథానాయికగా రకుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇదే సెట్ అయితే రకుల్కిది భారీ బంపర్ ఆఫర్ అని వేరే చెప్పక్కర్లేదు. ఇందులో మరో హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ పేరు కూడా వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం వాయిదా పడినప్పటికీ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందట. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1996లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్గా దీన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం 'మన్మథుడు 2', 'మార్జావాన్', శివకార్తికేయన్ చిత్రాల్లో నటిస్తూ రకుల్ బిజీ బిజీగా ఉంది.