Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డిస్కోరాజా'. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, ''నేల టిక్కెట్' తర్వాత మా బ్యానర్లో రవితేజ హీరోగా నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ నిరంతరాయంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్లో కోటి 20 లక్షల రూపాయాలతో వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నాం. ఇందులో రవితేజ, వెన్నెల కిషోర్, శశిర్ షరమ్, టోనిహొప్లపై అతి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. సినిమాకి ఈ సెట్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సెట్ని థియేటర్లో చూస్తే ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారు. ఈ నెల 26తో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్ట్ మెదటివారం నుండి ఢిల్లీలో షూటింగ్ జరుపనున్నాం. ఈ షెడ్యూల్లో నభా నటేష్ జాయిన్ అవుతారు. దర్శకుడు వి.ఐ.ఆనంద్ చాలా గొప్ప విజన్ ఉన్న వ్యక్తి. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం' అని తెలిపారు.