Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది నా గుండెల్లో ఉంటుంది
- మన సినిమాలు - అనుభవాలు- చరిత్ర - పరిణామం పుస్తకం ఆవిష్కరణలో పవన్ కళ్యాణ్
నవతెలంగాణ- నవచిత్రం
నాకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ అపారమైన సాహిత్యం ఉంది. ప్రతిభావంతులు న్నారు. ఇష్టంతోనే తెలంగాణ గురించి మాట్లాడ తాను. అంతేకానీ రాజకీయాల కోసం మాట్లాడను. తెలంగాణ నా రక్తం. అది నా గుండెల్లో ఉంటుంది. నిజ జీవితాన్ని సినిమా, సినిమాని నిజ జీవితం ప్రభావితం చేస్తుంటాయని నటుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నారు. ప్రజాశక్తి మాజీ సంపాదకులు, రచయిత, విశ్లేషకులు తెలకపల్లి రవి రాసిన 'మన సినిమాలు : అనుభవాలు- చరిత్ర - పరిణామం' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైద రాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది. పవన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదటి ప్రతిని నటుడు, రచయిత రావి కొండలరావుకి అందించారు. నటుడు, రచయిత తనికెళ్ళ భరణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అద్భుతమైన సినిమాలు తీయగల, ప్రపంచాన్ని శాసించే సత్తా మన తెలుగు పరిశ్రమకి ఉంది. అంతటి ప్రతిభావంతులు, అంతటి సాహిత్యం మన వద్ద ఉంది. 'దాసి', 'మా భూమి', 'రంగులకళ' వంటి సినిమాలు చూసినప్పుడు తెలంగాణలో ఉన్న సమస్యలు, భూస్వాములపై పోరాటం గుర్తుకు వస్తుంటాయి. ఎదురుతిరిగితే పోయేదేమి లేదు తరతరాలుగా ఉన్న దౌర్జన్యం తప్ప అనే పదం ఈ పుస్తకంలో ఉంది. అది నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగవు తుంది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు వారికి ధన్యవాదాలు' అని అన్నారు. 'అనుభవజ్ఞులైన రచయితలు, సీనియర్ జర్నలిస్ట్లు, ఎంతో మేథా సంపత్తి కలిగిన ప్రముఖులు వద్ద తల దించుకుని ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మెదళ్ళలోనుంచి వచ్చిన ప్రతి పదం సమాజాన్ని, మనుషులను ప్రభావితం చేస్తుంది. అన్ని మైత్రీల కంటే సాహిత్య మైత్రి గొప్పది. ఎంత మంది బలవంతులైనా ఎదుర్కో గలం కానీ, లక్షల మెదళ్ళని కదిలించే రచయితలని, మేధావులను ఎదుర్కోవడం కష్టం. వారి ఒక్క అక్షరం వెనకాల ఎన్నో రక్తపు చుక్కలుం టాయి. అందుకే వారంటే నాకు అపారమైన గౌరవం. వాళ్ళ ముందు గళ్ల ఎగిరేయడం కుదరదు. నేను స్కూల్ పుస్తకాలు చదవలేదు. కానీ చదవడం మాత్రం ఆపలేదు. నాకు 'వనవాసి' పుస్తకాన్ని తనికెళ్ళ భరణిగారు బహుమతిగా ఇచ్చారు. సినిమా అనేది శక్తివం తమైన మాథ్యమం. అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ పుస్తకాన్ని మూడు రకాలుగా విభజించి రాశారు. అందుకు తెలకపల్లి రవిని అబినందిస్తున్నాం. పరుచూరిగోపాలకృష్ణ లాంటి వాళ్ళు సమాజంలోని సమస్యలను వాణిజ్య అంశాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా రాయగలరు. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. పుస్తక రచయిత తెలకపల్లి రవి మాట్లాడుతూ, 'సినిమా చాలా శక్తివంతమైన దని గుడిపాటి వెంకటాచలం చెప్పారు. ఇటీవల సావిత్రి సినిమాకి జాతీయ అవార్డు కీర్తిసురేష్ రావడంతో మన సావిత్రికే వచ్చినట్టుగా భావించాం. 'ఈ కాలం హీరో ఆజానుభావుడు అవనక్కర్లేండోరు' అనే మాట తెలుగు సినిమా గతిని మార్చేస్తుంది. ఈ పుస్తకం వందేండ్ల సినిమా చరిత్రకి నీరాజనం, ప్రతిబింబం. సినిమా అంటే గ్లామర్, వసూళ్ళు, చప్పట్లు, ఈలలే కాదు, అది శక్తివంతమైన సాధనం. ఈ పుస్తకం గుడిపాటి వెంకటాచలం రచనతో మొదలవుతుంది. ఎందు కంటే 'మాలపిల్ల' అనే సినిమాకి రచన చేసిన మహాపాటి ఆయన. సినిమా రంగంలో వచ్చిన ఘనతా, క్షీణత రెండింటిని చెప్పే ప్రయత్నం చేశాం. ప్రత్నామ్నాయ సినిమా ఎందుకు అంతరిం చిపోతుందనే విషయాలు పొందుపరిచాం. సినిమా అనేది పెద్ద వ్యాపారం. కానీ సినిమాలోనుంచి సమాజం, సమాజంలోనుంచి సినిమా ప్రభావి తమవుతున్నాయనేది ఇందులో తెలిపాం' అని అన్నారు. రైటర్ సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ తెలకపల్లికి సంపాదకులుగా అన్ని అంశాలపై అపారమైన అవగాహనం ఉంది. ఆయన జీఎస్టీపై, నోట్ల రద్దుపై, 370 ఆర్టికల్ రద్దుపైనే కాదు, 'బాహుబలి' సినిమాని కూడా విశ్లేషణ చేయగలరు. ఆయన సినిమాపై ఈ పుస్తకం రాయడం గొప్ప విషయం. సినిమా గొప్పతనంతోపాటు, అది ఎంత పాతాళం లోకి వెళ్తుందో కూడా ఈ పుస్తకంలో చెప్పారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఈ పుస్తకం ఒక అద్భుతమైన ఆవిష్కరణ. సినిమా ఇచ్చే సందేశం వంద మీటింగ్లతో సమానం' అని తెలిపారు. ల రావి కొండలరావు మాట్లాడుతూ, 'ప్రతి చిత్ర పరిశ్రమకు ఒక సమగ్రమైన చరిత్ర ఉంది. కానీ మన తెలుగు సినిమాకి లేదు. ఒక కమిటీ వేసి సమగ్రమైన చరిత్రను పుస్తకం రూపంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.