Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి తనయుడు, హీరో రమేష్ విలన్గా మారుతున్నారు. 'నిరీక్షణ' చిత్రంలో విలన్గా నటిస్తున్నారు. సాయి రోనక్, ఎనా సహా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సందర్భంగా యూనిట్ తెలియజేస్తూ, 'సూపర్గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి.చౌదరి తనయులు రమేష్, జీవా తెలుగు, తమిళ భాషల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'విద్యార్థి' చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమైన రమేష్ ఆ తర్వాత తమిళంలో పలు సూపర్హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన తెలుగులో 'ఒకటే లైఫ్'లో నటించారు. ఇప్పుడు 'నిరీక్షణ' చిత్రంతో విలన్గా మారడం ఆనందంగా ఉంది. హై ఓల్టేజ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో శ్రద్ధా దాస్, సన ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది' అని తెలిపింది. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజరు ఘోష్, మధుసూదన్, వేణు, హర్ష ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి.వి, సంగీతం: మంత్ర ఆనంద్, ఎడిటింగ్: నందమూరి హరి.