Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఫలక్నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నరేష్ రెడ్డి కుప్పిలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ 'పాగల్' పేరుతో ఓ సినిమాని నిర్మించబోతున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ని ఎనౌన్స్ చేసిన సందర్బంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ''ఫలక్నుమా దాస్' లాంటి సూపర్ హిట్తో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా, 'హుషారు' వంటి హిట్ చిత్రం తర్వాత మా బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'హుషారు' సినిమా విజయం మాకు మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి, కొత్త వాళ్ళని పరిచయం చేయడానికి ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమాతో నరేష్ రెడ్డి కుప్పిలిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. తను చెప్పిన ఆసక్తికర కథాంశం మాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇది క్రేజీ లవ్ స్టొరీ అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సెప్టెంబర్ ద్వితీయార్థం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం' అని చెప్పారు.