Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి విద్యాసిన్హా(71) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమె జుహులోని ఓ ఆస్పత్రిలో గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా వెంటిలేటర్పైనే చికిత్స పొందుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. 1947 నవంబర్ 15న జన్మించిన విద్యా సిన్హా తన 18వ ఏట మోడల్గా కెరీర్ని ప్రారంభించారు. ఆ తర్వాత నటిగా మారారు. కిరణ్కుమార్ సరసన నటించిన 'రాజాకాక' చిత్రంతో వెండితెరకు నటిగా పరిచయం అయ్యారు. అనేక బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గానూ వ్యవహరించారు. హిందీలో నటించిన 'చోటీ సి బాత్', 'రజనీ గంధ', 'పతి పత్నీ ఔర్ వో' వంటి సూపర్ హిట్ చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె నటించిన 'రజనీగంధ' భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో అగ్ర నటిగా ఎదిగారు. ఈ క్రమంలో 1986 తర్వాత సినిమాలకు స్వస్తి పలికి, చివరగా 2011లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'బాడీగార్డ్'లో మెరిశారు. దీంతోపాటు 'కుల్ఫీ కుమార్ బజేవాలా', 'కుబూల్హై', 'కావ్యాంజలి', 'బాబీ' వంటి టీవీ షోస్తోనూ బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించారు.