Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందుకే పెద్దలు జెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలే' అని అంటున్నారు వరుణ్ తేజ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వాల్మీకి'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్తోపాటు తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా గురువారం ఈ చిత్ర టీజర్ని విడుదల చేశారు. ఇందులో విలన్ మాదిరి గుబురు గెడ్డంతో వరుణ్తేజ్ చేసే యాక్షన్, 'నా సినిమాలో నా విలనే.. నా హీరో' అని అధర్వ చెప్పే డైలాగ్, ''అందుకే పెద్దలు జెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలే' అని వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'జిగర్తాండ' చిత్రానికి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. వచ్చే నెల 13న సినిమాని విడుదల చేయనున్నారు.