Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. బన్నీ నటిస్తున్న 19వ చిత్రమిది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ 'అల వైకుంఠపురములో..'ను స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చిత్ర బృందం ప్రకటించింది. దీంతోపాటు ఫస్ట్ గ్లింప్స్ పేరుతో చిన్న వీడియోని విడుదల చేశారు. ఇందులో బన్నీని ఉద్దేశించి 'ఏంట్రోరు..గ్యాప్ ఇచ్చావు? అని మురళీ శర్మ ప్రశ్నించగా, 'ఇవ్వలా.. వచ్చింది' అని బన్నీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. అంతేకాదు సినిమాపై మరింత ఆసక్తి, అంచనాలను పెంచింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, 'త్రివిక్రమ్ చిత్రాల టైటిల్స్కి క్రేజ్ ఎక్కువ. ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టనున్నారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందరి అంచనాలకు మించిన మంచి టైటిల్ కుదిరింది. కథకు సరిగ్గా సరిపోవడం, అల్లు అర్జున్ ఇమేజ్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ఈ టైటిల్తో బజ్ పెరిగింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర టైటిల్ కూడా పండుగ సందడిని తెచ్చినట్టుంది. ఇక ఫస్ట్ గ్లింప్స్లో బన్నీ చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ తమకు ఫుల్ కిక్ ఇచ్చిందని బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బన్నీ సినిమాలంటే కుటుంబ సమేతంగా థియేటర్కు వెళ్లి ఎంజారు చేస్తారు. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్కి, త్రివిక్రమ్ మాటల తూటాలు కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల్లోని కామెడీనే ఇందుకు ఉదాహరణ. ముచ్చటగా మూడోసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నారు. కచ్చితంగా అలరించే చిత్రమవుతుంది' అని తెలిపింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజరు, రాహుల్ రామకృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్.