Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంశీ యాకసిరి, స్టెఫీ పటేల్ జంటగా అనిల్ తోట దర్శకత్వంలో ఎస్.ఎల్.ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ పతాకాలపై ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను తలచి'. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా, రక్షాబంధన్ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ, 'క్యూట్ లవ్ స్టోరీగా అనుకున్న బడ్జెట్, అనుకున్న టైమ్లో సినిమాని పూర్తి చేశాం. నా కథని నమ్మి సినిమా తీయడానికి ముందుకు వచ్చి, నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న వంశీ ఎక్కడా కొత్త వాడిలా అనిపించడు. ఆయన నటన సినిమాకి ప్లస్ అవుతుంది. అలానే స్టెఫీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. త్వరలోనే వీడియో సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేయనున్నాం' అని అన్నారు. 'నిజాయితీతో చేసిన ప్రయత్నమిది. కేవలం ఒక ప్రేమ కథలా కాకుండా అటు ఫ్యామిలీ, ఇటు యూత్ని ఆకట్టుకునేలా తెరకెక్కించాం. మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్లో సినిమాని విడుదల చేయనున్నాం' అని నిర్మాత అజిత్ కుమార్ చెప్పారు. హీరో వంశీ మాట్లాడుతూ, 'ఓ ఫీల్ గుడ్ చిత్రంతో హీరోగా పరిచయం కావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ అనిల్ తోట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రెడీ చేశారు. అలానే ఎక్కడా లోటు రాకుండా నిర్మాతలు నిర్మించారు. రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కచ్చితంగా ఆడియెన్స్ని అలరించే చిత్రమవుతుందని నమ్ముతున్నాం' అని తెలిపారు.