Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'మిషన్ మంగళ్'. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, నిత్యా మీనన్, తాప్సీ, శర్మన్జోషి, కీర్తి కుల్హారి ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి జగన్ శక్తి దర్శకత్వం వహించారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా గురువారం సినిమా విడుదలై భారీ ఓపెనింగ్స్ని రాబట్టింది. దాదాపు రూ.30కోట్లు వసూలు చేసింది. ఇండిపెండెంట్స్ డే సందర్భంగా విడుదలైన ఓ సినిమా ఇంత భారీ కలెక్షన్లని రాబట్టడం దాదాపు మూడేండ్ల తర్వాత ఇదే కావడం విశేషం. అంతేకాదు ఇందులో సోనాక్షి నటనకు విశేషమైన ప్రశంసలు దక్కుతున్నాయి. సైంటిస్ట్ ఏకా గాంధీ పాత్రలో ఆమె అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. గత చిత్రాలతో పోల్చితే మెరుగైన నటనని ప్రదర్శించి క్రిటిక్స్ నుంచి అప్రిషియేషన్స్ అందుకుంటుంది. ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల మంది ఆమెని ప్రశంసిస్తూ సందేశాలు పంపిస్తున్నారు. ఈ విషయంలో సోనాక్షి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి స్పందన గతంలో ఎప్పుడూ పొందలేదు. ఊహించలేదు. అందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది' అని తెలిపింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్తో కలిసి 'దబాంగ్ 3'తోపాటు 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో నటిస్తూ బిజీగా ఉంది.