Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు(సైమా)-2019 వేడుక అట్టహాసంగా జరుగుతుంది. సైమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా రామ్చరణ్(రంగస్థలం) నిలవగా, ఉత్తమ నటిగా 'మహానటి' చిత్రానికి గానూ కీర్తిసురేష్ అవార్డునందుకున్నారు. అలాగే ఉత్తమ చిత్రంగా 'మహానటి' ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్(రంగస్థలం) అవార్డునందుకున్నారు. క్రిటిక్ విభాగంలో ఉత్తమ నటుడిగా విజరు దేవరకొండ(గీత గోవిందం), ఉత్తమ నటిగా సమంత(రంగస్థలం) సైమా పురస్కారం అందుకున్నారు. వీరితోపాటు ఉత్తమ నూతన నటుడిగా కళ్యాణ్ దేవ్(విజేత), ఉత్తమ నూతన దర్శకుడిగా అజరు భూపతి(ఆర్ ఎక్స్ 100), ఉత్తమ నూతన నటిగా పాయల్ రాజ్పుత్(ఆర్ ఎక్స్ 100), ఉత్తమ సహాయ నటిగా అనసూయ(రంగస్థలం), ఉత్తమ సహాయ నటుడిగా రాజేంద్రప్రసాద్(మహానటి), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్(రంగస్థలం), ఉత్తమ హాస్య నటుడిగా సత్య(ఛలో), ఉత్తమ విలన్గా శరత్ కుమార్(నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా), ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే-రంగస్థలం), ఉత్తమ గాయనిగా ఎం.ఎం.మానసి(రంగమ్మా..మంగమ్మా-రంగస్థలం), ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి(పిల్లారా - ఆర్ ఎక్స్ 100), ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు(రంగస్థలం), ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా మౌనికా, రామకృష్ణ(రంగస్థలం), సోషల్ మీడియా పాపులర్ సెలబ్రిటీగా విజరు దేవరకొండ సైమా అవార్డులను అందుకున్నారు. ఇందులో తొమ్మిది అవార్డులతో 'రంగస్థలం' అగ్ర స్థానంలో నిలిచింది. చెరో మూడు అవార్డులతో 'మహానటి', 'ఆర్ ఎక్స్ 100' తర్వాతి స్థానంలో నిలవడం ఓ విశేషమైతే, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ రెండు అవార్డులను అందుకోవడం మరో విశేషం. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ఆయనతోపాటు రాధిక, సాయికుమార్, యశ్, సుధీర్బాబు, సందీప్ కిషన్, రాయ్ లక్ష్మి, అల్లు అరవింద్, హేబా పటేల్, చాముండేశ్వరినాథ్, తిరుమల్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగా తదితర సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. శ్రియా, అనసూయ, నిధి అగర్వాల్ తదితర కథానాయికలు చేసిన డాన్స్లు ఆకట్టుకున్నాయి. ఖతార్ రాజధాని దోహలో జరిగే ఈ వేడకకి సుమ, సాయికుమార్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హోస్ట్లుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా కీర్తిసురేష్ జాతీయ అవార్డుకి ఎంపికైన నేపథ్యంలో సైమా వేడుకలో ఆమె చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు ఈ వేడుకకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.