Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'రణరంగం'. సినిమా గురువారం విడుదలైన నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ, 'సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని నిర్మాతలు చెప్పారు. హ్యాపీగా ఉంది. ఏదో సందేశం ఇవ్వాలని సినిమా చేయలేదు. ఓ కొత్త రకమైన స్క్రీన్ప్లే బేస్డ్గా ప్రాపర్ యాక్షన్ సినిమాని తీయాలని రూపొందించాం. ఈ విషయంలో రెండువందల శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ ఇది అని అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్కి మంచి పేరొచ్చింది. ఫైట్ సీన్స్ని వెంకట్ మాస్టర్ అత్యంత సహజంగా కంపోజ్ చేశారు. చిన్నరోల్ అయినా నటించినందుకు కాజల్కి థ్యాంక్స్. సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. రిలీజైనప్పుడు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్ షోకు వచ్చేసరికి ఎబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా. బాగా లేకపోతే సెకండ్షోకే కలెక్షన్లు పడిపోతాయి. కానీ మా సినిమాకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటిసారి మాస్ క్యారెక్టర్ చేశాను. నా పాత్రని తెరపై చూసుకున్నప్పుడు నాకు నేను బాగా నచ్చాను. రెండు షేడ్స్ ఉన్న పాత్రని చేయడం బాగా ఎంజారు చేశా. క్లైమాక్స్లో ఫైట్ పెడితే రెగ్యులర్గా ఉంటుందని పెట్టలేదు. అయితే స్క్రీన్ప్లేలోని కన్ఫ్యూజన్, క్లైమాక్స్ విషయంలో జరిగిన పొరపాట్ల ద్వారా నేర్చుకున్నాం. మున్ముందు సినిమాల్లో మళ్ళీ అలాంటివి జరగకుండా చూసుకుంటాం' అని అన్నారు. 'మొదట్నుంచి చెబుతున్న ఇది శర్వానంద్ సినిమా అని. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం ఆయనే. ఇప్పటి దాకా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో దేనికీ రానన్ని ఫోన్లు ఈ సినిమాకి వస్తున్నాయి. థియేటర్స్ ఫుల్ కావడం హ్యాపీగా ఉంది. ప్రశాంతి పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలు చాలా రిచ్గా నిర్మించారు. ఇలాగే కొనసాగితే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది' అని దర్శకుడు సుధీర్వర్మ చెప్పారు. చిత్ర సమర్పకుడు పి.డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ, 'కలెక్షన్లు చాలా బాగున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 7.50 కోట్ల గ్రాస్, రూ. 4.45 కోట్ల షేర్ వచ్చింది. 1985లో గిరిబాబు డైరెక్షన్లో వచ్చిన 'రణరంగం'ను కూడా మేమే నిర్మించాం. అది మంచి సక్సెస్ అయ్యింది. ఆ సినిమా ఆడిన అనేక థియేటర్లలో ఇప్పుడు ఈ 'రణరంగం' విడుదలవడం హ్యాపీగా ఉంది. ఆడియెన్స్ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజా, కెమెరామెన్ దివాకర్ మణి తదితరులు పాల్గొన్నారు.