Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రం 'అ!'. గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు మేకప్, వీఎఫ్ఎక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. హీరో నాని నిర్మించిన ఈచిత్రంలోని ఓ ముఖ్య పాత్రలో కాజల్ నటించిన విషయం విదితమే. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ని రూపొందించే పనిలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉన్నారని సమాచాం. ఇందులో కథానాయికగా ఇప్పటికే కాజల్ని ఎంపిక చేశారట. ఆమెతోపాటు తమిళ హీరో విజరు సేతుపతి మరో ముఖ్య పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. గత చిత్రంలా కాకుండా డిఫరెంట్ కథాంశంతో కమర్షియల్ అంశాల మేళవింపుగా ఈ సినిమాని రూపొందించేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే, మంచు విష్ణు సినిమాలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగల్ ఇచ్చిందట. క్రైమ్ థ్రిల్లర్గా తెలుగు, ఇంగ్లీష్లో రూపొందే ఈ సినిమాలో ఆమె మంచు విష్ణు సోదరిగా కనిపిస్తారట. దీనికి 'కాల్సెంటర్' అనే టైటిల్ వినిపిస్తోంది.