Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా మల్టీస్టారర్ 'వెంకీమామ' చిత్రం రూపొందుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్లో వెంకటేష్ గాయపడ్డారట. యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న క్రమంలో వెంకీ కాలుకి గాయమవ్వగా షూటింగ్ని నిలిపివేశారట. గాయం కారణంగా ప్రస్తుతం ఆయన రెస్ట్లో ఉన్నారు. కోలుకున్నాక తిరిగి షూటింగ్ని ప్రారంభించి పూర్తయ్యేంత వరకు బ్యాక్ టూ బ్యాక్ చిత్రీకరణ జరిపేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందులో వెంకటేష్ రైతుగా, చైతూ సైనికుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. వెంకీ సరసన పాయల్ రాజ్పుత్, చైతూ సరసన రాశీఖన్నా కనిపించనున్నారు.