Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమాని పక్కా ప్లానింగ్తో అనుకున్నట్టుగానే చేశాం. ఇది ఏ సెంటర్కి పరిమితమయ్యే చిత్రమనుకున్నాం. కానీ బి, సి సెంటర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. జనం నుంచి ఇంత రియాక్షన్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. మాకిది కిక్నిచ్చింది' అని అంటున్నారు దర్శకుడు వెంకట్ రామ్జీ. అడివిశేషు, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులుగా వెంకట్ రామ్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవరు'.
ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోన్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ, 'నేను యూఎస్లో స్టడీ చేశా. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. మొదటగా గుణ్ణం గంగరాజు దగ్గర పనిచేశా. టీవీ సీరియల్స్కి రైటర్గానూ పనిచేశాను. దర్శకత్వ శాఖలోనే కాదు ప్రొడక్షన్, మార్కెటింగ్ వంటి వివిధ రకాల విభాగాల్లోనూ వర్క్ చేశా. కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్తోనూ కలిసి పనిచేశా. ఈ క్రమంలో దర్శకత్వం వహించాలనిపించింది. ఓ కథతో పీవీపీని కలిశా. ఆయన స్పానిష్ ఫిల్మ్ 'ది ఇన్విజబుల్ గెస్ట్' గురించి చెప్పారు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. కాకపోతే సినిమా చాలా కోల్డ్గా ఉంటుంది. కోల్డ్ అంటే ఎలాంటి ఎమోషన్స్, యాంగ్రీనెస్ లేకుండా ఉండటం. దాన్ని అలా తీస్తే మన దగ్గర వర్కౌట్ కాదు. ఆ కథపై వర్క్ చేసి ఎమోషన్స్ యాడ్ చేశాం. ఈ క్రమంలో శేషు, అబ్బూరి రవి ఎంతో హెల్ప్ చేశారు. డైలాగ్స్ పరంగా రవి చాలా సపోర్ట్ చేశారు. కాస్టింగ్ అనుకున్నప్పుడు సమీర పాత్రకి రెజీనానే సూట్ అవుతుందనిపించింది. ఆమె నటించిన 'అ!' సినిమా చూశా. డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ కథని చెబుతున్నప్పుడు సమీరలాగే రెండుమూడు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దీంతో తనే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయా. అంతేకాదు మురళీశర్మ లాంటి ఆర్టిస్టులను వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకుండానే ఎంపిక చేసుకున్నా. నవీన్ చంద్ర హీరోగా చేస్తున్నాడు ఇలాంటి పాత్ర చేస్తాడా? అనే సందేహం ఉండేది. 'అరవింద సమేత' విడుదలయ్యాక ఆయన చేయగలడనే నమ్మకం వచ్చింది. కథ చెప్పినప్పుడు ఇది నా కెరీర్కి హెల్ప్ అవుతుందన్నారు. ఇప్పుడు విడుదలయ్యాక ఆయనకు మంచి పేరు వచ్చింది. శేషు, పీవీపీతో 'క్షణం' నుంచి ట్రావెల్ అవుతున్నారు. అందుకే సినిమాలో ఆయన బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం ఐడియాలు చెబితే ఏది, కరెక్టో చెప్పగలడు. ఆయన జడ్జ్మెంట్ బాగుంటుంది. రైటింగ్ సైడ్ నా ఫస్ట్ ఆడియెన్ శేషునే. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. సినిమా తీసేటప్పుడు మధ్యలో ఓసారి రఫ్ కట్స్ చూసుకున్నా. దీంతో నమ్మకం వచ్చింది. మూడు నాలుగు సీన్స్ పండితే సినిమా సూపర్ హిట్ అనుకున్నాం. ఏ సెంటర్లలో బాగా ఆడుతుందనుకున్నాం. కానీ విడుదలయ్యాక బి, సి సెంటర్లని బాగా ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సినిమాని ఎంజారు చేస్తున్న విధానం నాకు ఎంతో కిక్నిచ్చింది. కలెక్షన్లు రోజు రోజుకి పెరుతున్నాయి. పీవీపీ గారు 'క్షణం' సినిమాతో చిన్న బడ్జెట్ సినిమాల్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనేలా సెట్ చేశారు. ఆ తర్వాత 'బ్రోచేవారెవరురా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' సినిమాలు ఆ కోవలోనే కంటెంట్తో వచ్చి విజయం సాధించాయి. విదేశీ చిత్రాలను రీమేక్ చేసేటప్పుడు వాటిలోని ఎమోషన్స్ని పట్టుకోవాలి. దాన్ని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి. చాలా వరకు అది మిస్ చేయడం వల్లే ఇక్కడ వర్కౌట్ కావడం లేదని నా అభిప్రాయం. నెక్ట్స్ నా సొంత కథతో పీవీపీతోనే ఓ సినిమా చేయనున్నాం. అది కూడా థ్రిల్లరే' అని అన్నారు.