Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా అవార్డుని కైవసం చేసుకున్న కీర్తి సురేష్కి పలు భాషల నుంచి బంపర్ ఆఫర్లు రావడం విశేషం. అందులోనూ మహిళా ప్రధాన చిత్రాల్లో నటించే అవకాశం రావడం మరో విశేషం. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో రెండు మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్న కీర్తికి తాజాగా బాలీవుడ్లోనూ ఇదే తరహా సినిమాలో నటించే అరుదైన అవకాశం దక్కింది. కీర్తి ప్రధాన పాత్రధారిణిగా, అజరు దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న 'మైదాన్' చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. 'బదాయిహో' చిత్ర దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ నేపథ్యంలో రూపొందబోయే ఈచిత్రంలో కీర్తి పోషించబోయే పాత్ర చాలా శక్తివంతంగా, మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. దర్శకులు నరేంద్ర, ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించబోయే తెలుగు, తమిళ మహిళా ప్రధాన చిత్రాల్లో కీర్తి నటిస్తోంది. మొత్తమ్మీద త్రిభాషల్లో బ్యాక్ టు బ్యాక్ మూడు ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో కీర్తి నటించడం గ్రేట్థింగ్ అని వేరే చెప్పక్కల్లేదు.