Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'కల్కీ'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రాజశేఖర్ తాజాగా ఓ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్సిగల్ ఇచ్చారు. సరికొత్త తరహా కథాంశంతో తెరకెక్కబోయే ఈచిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డా||జి.ధనుంజయన్ నిర్మిస్తున్నారు. తెలుగు 'క్షణం' చిత్రాన్ని శిబిరాజ్తో 'సత్య', 'బేతాళుడు' చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి నిర్మాత డా||జి.ధనుంజయన్ మాట్లాడుతూ,'సింగిల్ లైన్ వినగానే హీరో రాజశేఖర్ బాగా ఎగ్జైటై వెంటనే ఈ ప్రాజెక్ట్కి పచ్చజెండా ఊపారు. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన 'కిల్లర్' చిత్రానికి సంగీతం సమకూర్చిన సైమన్.కె.కింగ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్తోపాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం. అలాగే సినిమా టైటిల్ని నిర్ణయించి త్వరలోనే షూటింగ్ మొదలు పెడతాం. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా మార్చిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.
'తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డులను గెల్చుకున్న నిర్మాత డా||జి.ధనుంజయన్. సమంత అక్కినేని నటించిన 'యు టర్న్' సినిమాతోపాటు విజరు ఆంటోని 'కొలైకారన్'ను తమిళంలో నిర్మించారయన. ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనా కాంబినేషన్లో తిరు దర్శకత్వంలో 'మిస్టర్ చంద్రమౌళి' సినిమా, జ్యోతిక, లక్ష్మీ మంచుతో రాధామోహన్ దర్శకత్వంలో 'కాట్రిన్ మొళి' చిత్రాన్ని ధనుంజరు నిర్మించారు. తాజాగా విజరు ఆంటోనితో రెండు వరుస చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్గా డా|| రాజశేఖర్ సినిమాతో ఆయన తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెడుతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎస్.పి.శివప్రసాద్, ఫైనాన్షియల్ కంట్రోలర్ : సి.ఎ.జి.గోకుల్.